నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: శ్రీనివాస్

52பார்த்தது
వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ గుర్రం ద్వారకా శ్రీనివాస్ అన్నారు. తెనాలిలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన పంట పొలాల్లో నీరు భారీగా చేరి, వరి పంటకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతును గుర్తించి ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி