ఆ శాఖ‌ల‌పై ఫోక‌స్ పెట్టిన సీఎం చంద్ర‌బాబు

74பார்த்தது
ఆ శాఖ‌ల‌పై ఫోక‌స్ పెట్టిన సీఎం చంద్ర‌బాబు
ఆదాయార్జన శాఖలపై ఫోకస్‌ పెట్టారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆదాయార్జన శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జీఎస్టీ వసూళ్లపై ఆరా తీశారు. జీఎస్టీ ఎగవేత జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందుల్లేని పాలసీలు అమలు చేస్తూనే. ఆదాయం పెంచేలా చూడాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி