గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే బూర్ల

67பார்த்தது
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలో గురువారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో తెదేపాను బలోపేతం చేయాలని సూచించారు. గ్రామస్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி