రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

74பார்த்தது
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందారు. జిలపోగుల రాజేష్ బాబు(32) ఓ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. ఆదివారం విధులు ముగించుకుని ఆటోలో పొన్నూరుకు వెళ్తుండగా శాంతినగర్ అడ్డరోడ్డు వద్ద ఆటోను బాపట్ల వైపు వెళుతున్న మరో ఆటో వేగంగా ఢీకొట్టడంతో రాజేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన ఆటో ఆగకుండా వెళ్లిపోయింది. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி