గుంటూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా కందుల దుర్గేశ్

58பார்த்தது
గుంటూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా కందుల దుర్గేశ్
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించింది. కేబినెట్లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. మంగళవారం గుంటూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును ఈయన పర్యవేక్షిస్తారు.

தொடர்புடைய செய்தி