యజ్ఞం లా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవాలి

52பார்த்தது
అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దేవసేన కుమారి పాల్గొని మొక్కలను నాటారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంలా తీసుకోవాలని అన్నారు. మొక్కలను నాటితే అవి మనల్ని రక్షిస్తాయని ఆమె పేర్కొన్నారు. వృక్షో రక్షి రక్షితః అనే సూక్తిని పాటించాలని ఎంపీడీవో దేవసేన కుమారి సూచించారు.

தொடர்புடைய செய்தி