మద్యం మత్తులో ప్రియురాలిని చంపిన ప్రియుడు

69பார்த்தது
మద్యం మత్తులో ప్రియురాలిని చంపిన ప్రియుడు
మద్యం మత్తులో ఓ వ్యక్తి తన ప్రియురాలిని చంపేశాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం రామలింగాపురంలో జరిగింది. కాటమ్మ అనే మహిళ భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన చెంచయ్యతో ప్రేమాయణం సాగిస్తోంది. ఓ రైతు వద్ద ఇద్దరూ కూలీ పని చేస్తూ సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. అయితే శుక్రవారం రాత్రి మద్యం మత్తులో కాటమ్మను చెంచయ్య కర్రతో తలపై కొట్టడంతో ఆమె మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி