మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలోని సెప్టెంబర్ 20 న షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి రెహ్తీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓ యువకుడు మహిళా నర్సుపై దాడి చేశాడు. విషం తాగిన వ్యక్తిని కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. సిబ్బంది ప్రథమ చికిత్స చేసి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు. ఈ క్రమంలో పేషేంట్ తో పాటు వచ్చిన యువకుడు కోపంతో మహిళా నర్సుతో దురుసుగా ప్రవర్తించి చెంప దెబ్బ కొట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.