వరంగల్: ఆకాశవాణి వ్యాఖ్యాతల నూతన సంఘం ఎన్నిక

84பார்த்தது
వరంగల్: ఆకాశవాణి వ్యాఖ్యాతల నూతన సంఘం ఎన్నిక
ఆకాశవాణి వరంగల్ జిల్లా వ్యాఖ్యాతల నూతన సంఘాన్ని ఆదివారం హనుమకొండలో ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా డా. పసుల ఎల్లయ్య వ్యవహరించగా నూతన అధ్యక్షుడుగా డా. మోటె చిరంజీవి, ప్రధాన కార్యదర్శిగా అర్షం సదానందంలు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారిగా డా. పి. శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా గాదె శ్యామ్, బి. చైతన్య, సి. స్వప్న, సహాయ కార్యదర్శులుగా ఏం. స్రవంతి, రామకృష్ణచారి, మరి కొంతమందిని ఎన్నుకున్నారు.

தொடர்புடைய செய்தி