పిడుగుపడి లక్షల్లో ఆస్తినష్టం

55பார்த்தது
భిమాదేవరపల్లి రంగయ్యపల్లి గ్రామానికి చెందిన ఎర్రబొజ్జ రాధిక ఇంటిపై పిడుగుపడి రూ. లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పిడుగుపడి ఇంట్లో నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో రాధిక మంగళవారం వచ్చారు. ఇంట్లో ఉన్న రూ. 3 లక్షల నగదు, కుమారుడు తెచ్చిపెట్టుకున్న సీసీ కెమెరాలు, రెండు జిరాక్స్ మిషన్లు, రెండు తులాల బంగారు ఆభరణాలు కరిగిపోయాయి.

தொடர்புடைய செய்தி