ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల, పరకాలలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వర్షాలు సమీపిస్తున్న నేపథ్యంలో
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.