బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ల కోసం వరంగల్ కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీజీ ఈఏపీసీఈటీ 2024-25 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లను ఈ నెల 6 నుంచి 14 వరకు అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత తాత్కాలిక, తుది మెరిట్ జాబితా విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.