హైదరాబాద్ బొగ్గులకుంటలో శుక్రవారం తెలంగాణ సరస్వత పరిషత్ ఆడిటోరియంలో నిర్వహించిన నేషనల్ ప్రీమియం 2024 అవార్డు దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన సంగీత దర్శకుడు హన్మకొండ బిక్షపతిని వరించింది. ఈ అవార్డు పాటలకు సంగీతం సమకూర్చినందుకుగాను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సినీ నటులు సమ్మెట గాంధీ, యోగి కత్రి, శుభోదయం సుబ్బారావు, సత్యనారాయణ, చేతుల మీదుగా అవార్డు ప్రధాన ఉత్సవం చేశారు.