హన్మకొండ జిల్లాలోని అశోక హోటల్లో సోమవారం ఆజాద్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ అవినాష్ అంతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఐదు చోట్ల తమ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వారిని గెలిపించాలని కోరారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఒక్కసారి తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు.