హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రజలు ఆదివారం రాత్రి దీపావళి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాతిమానగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ మేరకు రోడ్డుపై బాణాసంచాలు కాలుస్తూ సంబురాలు జరుపుకునే ఒకరినొకరు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.