వరంగల్: లలితా మహా త్రిపురసుందరిగా భద్రకాళి

76பார்த்தது
చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరత్ర మహోత్సవములు సోమవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. అర్చకులు నిత్యాహ్నికం నిర్వర్తించి అమ్మవారిని లలితా మహా త్రిపుర సుందరి గా అలంకరించారు. ఉదయం పల్లకి సేవ, సాయంకాలం శేషవాహన సేవ జరిపారు. పల్లకి సేవలో అమ్మవారిని దర్శించిన భక్తులకు సమస్త భోగాలు కలుగుతాయి. శేషవాహనంపై సేవింపబడిన అమ్మవారి యోగసిద్ది కులుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி