షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఎల్బి కళాశాలలో శనివారం నిర్వహించిన డా. బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి కొండ సురేఖ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి డిఆర్డిఓ కౌసల్య, దళిత సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.