బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను సాకారం చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఒక్కడిగా మొదలైన కేసీఆర్ తెలంగాణ కోసం తెగించి పోరాడారు. ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో లక్షలాది మందితో సభ నిర్వహించనున్నామన్నారు.