హన్మకొండ గోపాలపురం అరుణోదయ కాలనీకి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు తాటికొండ శ్రీజిత్ శివరాత్రి పురస్కరించుకొని శ్రీజిత్ చాక్ పీస్ తో 5mm ఎత్తు గల 108 శివలింగాలు రూపొందించాడు. ఇవి చెక్కడానికి 24 గంటల సమయం( రోజు మూడు గంటల చొప్పున) పట్టింది. గతంలో శ్రీజిత్ వివిధ కళాఖండాలు చెక్కి అంతర్జాతీయ రికార్డ్ మరియు రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ కార్యక్రమం లో అవార్డును పొందాడు. శ్రీజిత్ మిల్లీమీటర్ సైజులో కల కళాఖండాలను రూపొందించుతూ పలువురి మన్నలను అందుకుంటున్నాడు.