వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు మంగళవారం పలు పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించిందని, ఈ సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక తరగతుల పేరిట పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ డీఈవో వాసంతి తెలిపారు.