ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను నిబద్ధతతో పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ఆదేశించారు.