పరారీలో నకిలీ సర్టిఫికెట్ల నిందితుడి

59பார்த்தது
వరంగల్ తహసిల్దార్ ఆఫీస్ లో బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం. సుమారు 480 వివిధ రకాల సర్టిఫికెట్లు తయారు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్ సంతకం ఫోర్జరీ చేసి స్టాంప్ వేసి ఈ సర్టిఫికెట్లు తయారు చేశారని తెలిపారు. మట్టేవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా, ప్రధాన నిందితుడు సతీష్ పరారీలో ఉన్నాడు. మిగతా నిందితుల కోసం మంగళవారం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

தொடர்புடைய செய்தி