భూకబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం

61பார்த்தது
జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు భూమిని కేటాయించింది. ఆ భూమిని ఇటీవల కొందరు కబ్జాదారులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బాధితులు నిరసనకు దిగారు. దీంతో స్పందించిన అధికారులు బుధవారం ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బాధితులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

தொடர்புடைய செய்தி