జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. ఉపాధ్యాయులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.