అధికారులు అవినీతికి పాల్పడకుండా పనిచేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హెచ్చరించారు.