ఎమ్మార్వో పై చర్యలు తీసుకోవాలి

53பார்த்தது
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట బోళ్ల రాజ్ కుమార్ అనే రైతు పురుగుల మందు డబ్బాతో మంగళవారం నిరసనకు దిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన భార్య స్వప్న పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని తాహసిల్దార్ వేరొకరి పేరు మీద అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపించారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ పై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలంటూ బాధిత రైతు వేడుకున్నారు.

தொடர்புடைய செய்தி