పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో పరకాలలోని తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు. పరకాల మాజీ శాసనసభ్యులు మొలుగురి భిక్షపతి, పట్టణ ఇంచార్జి గుండపు చరణ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కోయ్యడ శ్రీను ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.