శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో భక్తుల సందడి

69பார்த்தது
శ్రావణ మూడవ సోమవారం సందర్బంగా జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. శ్రావణ సోమవారం తో పాటు రాఖీ పౌర్ణమి కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వందలాదిగా తరలివచ్చినట్లు ఆలయ అర్చకులు వివరించారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు పంపిణి చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி