నర్సంపేటలో భారీ వర్షానికి కూలిన ఆర్చీలు

77பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి స్వాగత ఆర్చీలు కూలిపోయాయి. అంబేడ్కర్ విగ్రహం 2 వైపులా దేవి శరన్నవరాత్రి వేడుకలకు తాత్కాలిక స్వాగత ఆర్చిలను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. భారీ వర్షం, ఈదురుగారులకు ఆర్చీలు నేలకొరిగాయి. వర్షానికి జనసంచారం లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி