విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన

73பார்த்தது
విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని ములుగు జిల్లా కన్నాయిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం పొదెం కృష్ణ ప్రసాద్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో గురువారం భూపతిపురం, నాగపూర్ గ్రామాల్లో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించారు. పాఠశాలలో సౌకర్యాలు, వసతులు, భోజనం గురించి వివరించి, పిల్లలను చేర్పించాల్సిందిగా తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, వెంకన్న, రామారావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி