ఓ బ్యాంకులో రూ. 1. 44కోట్ల విలువైన బంగారం మాయమైన ఘటన ములుగు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగపేట మండలం రాజుపేటలోని ఓ బ్యాంకులో ఇటీవల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆడిటింగ్ జరుగుతుండగా బంగారం మాయమైనట్లు ఆడిటర్లు గుర్తించి బ్యాంకు మేనేజర్ దృష్టికి శనివారం తీసుకెళ్లారు. విషయం బయటికి రావడంతో అప్రమత్తమైన గోల్డ్ అప్రైజర్ గ్రామం నుండి ఉడాయించాడు. నర్సంపేటకు చెందిన వ్యక్తిని బ్యాంకు అధికారులు పట్టుకున్నారు.