వానకాలం పంటకు సమృద్ధిగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత కుమారి అన్నారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ. రాబోయే 25 రోజుల వ్యవధిలో రైతులు విత్తనాలను కొనుగోలు చేస్తారని, ఈ సమయంలో క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ నకిలీ విత్తనాలను అరికట్టాలని సూచించారు.