ములుగు జిల్లా కేంద్రంలో బిజెపి ర్యాలీ

76பார்த்தது
ములుగు జిల్లా కేంద్రంలో బిజెపి ర్యాలీ
ఎమర్జెన్సీ దినం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం బిజెపి నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి హాజరై మాట్లాడారు. దేశ చరిత్రలోనే 1975 జూన్ 25 ఒక చీకటి రోజుగా నిలిచిపోయిందని, ఇదే రోజున నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశంలో అంతర్గత అస్థిరతను, అశాంతి కారణంగా చూపుతూ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారన్నారు.

தொடர்புடைய செய்தி