పరవళ్లు తొక్కుతున్న భీముని జలపాతం

65பார்த்தது
మహబూబాబాద్ గూడూరు ఏజెన్సీలోని సీతానగరం గ్రామశివారు కొమ్ములవంచ అటవీ ప్రాంతంలో సోమవారం భీముని జలపాతం పాల నురుగులా జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి సందర్శకులు పరవశించిపోతున్నారు. ఈ సుందరమైన దృశ్యాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ ప్రాంతానికి రావడానికి వరంగల్ నుంచి బస్సు సౌకర్యం, పర్యాటకులకు మంచినీటి వసతి సౌకర్యాలు కల్పించినట్లు గూడూరు అటవీశాఖ అధికారి సురేష్ తెలిపారు.

தொடர்புடைய செய்தி