ఈఏపీసెట్ 2024 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిందని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎ. నర్సయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించిన వెరిఫికేషన్ లో 1110 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. వెరిఫికేషన్ లో ఎస్. రాజేష్ కుమార్, రవీందర్, వై. గణేష్, టి. కరుణాకర్, సీహెచ్. మోహన్, జి. కల్పన, వై. కళావతి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.