ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

85பார்த்தது
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్
జనగామ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాకపోయినా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 90523 08621ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி