వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇఎపిసిఇటి కౌన్సెలింగ్ జరుగుతుందిని శనివారం ప్రిన్సిపల్ నర్సయ్య తెలిపారు. జూలై 4 నుండి 12 వరకు విద్యార్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. విద్యార్ధులు 2024కి సంబంధించిన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, 12వ తరగతి మెమో, ఇఎపిసిఇటి ర్యాంక్ కార్డ్ తో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.