రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. బుధవారం జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో ఎంపిక చేసిన 29 ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, మండలంలోని ఎన్టీఆర్ నగర్ ప్రాథమిక పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి, పాఠశాలలు ప్రారంభించడానికి ముందే పనులు పూర్తి చేయాలన్నారు.