సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరం లాంటిదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పలువరు లబ్దిదారులకు రూ. 5, 35, 000/- లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంలాంటిందన్నారు.