VIDEO: కొండపై నుంచి బోల్తా పడిన కారు.. ఇద్దరు యువకులు మృతి

569பார்த்தது
హిమాచల్‌లోని సిమ్లాలో శనివారం అర్థరాత్రి కారు కొండపై నుంచి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి తరలించారు. కొండపై నుంచి కింద పడిన కారు ఓ భవనంలో ఇరుక్కుపోయినట్లు సమాచారం. మృతులను అజయ్( 27), విశాల్‌ (27)గా పోలీసులు గుర్తించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி