ముంబైలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. వ్యాపారవేత్త భవేశ్ నాగిన్ సేథ్ (56) బాంద్రా- వర్లీ సముద్రపు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడికి వాట్సప్లో వీడియోకాల్ చేసి చనిపోతున్నట్లు సమాచారం ఇచ్చాడు. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నోట్ రాసి చనిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. భవేశ్ ఆర్థిక ఇబ్బందులు వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.