సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నెలవారీ పీరియడ్స్ సమయంలో బాత్రూంలో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకవుతుందంటూ పీఈటీ జ్యోత్స్న వేధిస్తుందని తంగళ్ళపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థినులు తెలిపారు. బాత్రూమ్లోనే బాధిత విద్యార్థినుల బట్టలు విప్పించి, కర్రతో చితకబాది వీడియోలు తీసినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. దీంతో పీఈటిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ 500మంది విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు.