సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు

57பார்த்தது
సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు
AP: అనకాపల్లి జిల్లాలో ఆదివారం విషాదం ఘటన జరిగింది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్రంలోకి స్నానానికి 12 మంది విద్యార్థులు వెళ్లారు. అందులో.. తుర్ల అర్జున్, బబ్లు అనే ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. మిగతా పది మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం మెరైన్, ఎస్ రాయవరం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி