AP: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. తల్లి, కూతురును ఓ దుండుగుడు దారుణంగా హత్య చేశాడు. మృతులను ఎండి సల్మాన్ (38), ఆమె కుమార్తె ఎండి సానియా (16)గా గుర్తించారు. HYDకు చెందిన నిందితుడు శివకుమార్కు సల్మాన్తో పరిచయం ఏర్పడగా ఇద్దరు స్నేహంగా ఉండేవారు. ఈ క్రమంలో సల్మాన్ వేరే వ్యక్తితో చాటింగ్ చేస్తుండడంతో సహించలేకపోయిన శివ తల్లీకూతుళ్లను ఇద్దరిని చంపేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.