టూరిస్ట్ బస్సుకు ప్రమాదం.. 18 మందికి గాయాలు

79பார்த்தது
టూరిస్ట్ బస్సుకు ప్రమాదం.. 18 మందికి గాయాలు
విశాఖలోని కైలాసగిరి కొండపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్టులతో వెళుతున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా, ఘటన స్థలాన్ని నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. అనంతరం కేజీహెచ్‌కు వెళ్లి బాధితులను పరామర్శించారు.

தொடர்புடைய செய்தி