చేపల వేటకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి

583பார்த்தது
చేపల వేటకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి
తెలంగాణలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపల వేట కోసం వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వాగులో పడి ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రకు చెందిన నాగుల్‌వాడ్‌ రాజు - మీనా దంపతులు తాంసి మండలంలో ఉంటున్నారు. వీరి కుమారులు విజయ్‌(28), ఆకాష్‌(26), అక్షయ్‌(22) పొచ్చర వాగులో చేపలు పడుతుండగా కొట్టుకుపోయి మరణించారు. వీరిలో విజయ్, అక్షయ్‌లకు రెండేళ్ల క్రితం... ఆకాశ్‌కు నాలుగు నెలల కిందట వివాహమైంది. విజయ్‌కు 10 నెలల బాబు ఉన్నాడు.

தொடர்புடைய செய்தி