అర్ధరాత్రి బంగారం షాపులో చొరబడి దొరికిందంతా దోచుకెళ్లారు (వీడియో)

80பார்த்தது
ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం తోటమ్మ తల్లి గుడి వద్ద బంగారం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. నలుగురు వ్యక్తులు షట్టర్ ఎత్తి దుకాణంలోకి చొరబడి సుమారు రూ.35 లక్షలు విలువ చేసే వెండి, బంగారం వస్తువులను అపహరించారు. షాపు షట్టర్ తీసి దర్జాగా నగదు చోరీ చేయటం సీసీ కెమెరాలో రికార్డు అయింది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు విచారిస్తున్నారు. రాజస్థాన్ ముఠాకు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

தொடர்புடைய செய்தி