మాజీ మంత్రి సిద్ధిఖీని హత్య చేసింది వీరే

54பார்த்தது
మాజీ మంత్రి సిద్ధిఖీని హత్య చేసింది వీరే
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి, సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ ముంబైలోని బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అతనిపై ముగ్గురు నిందితులు కాల్పులు జరిపారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని చెప్పినట్టు సమాచారం. అరెస్టయిన ఇద్దరు పేర్లు కర్నైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్ అని పోలీసులు గుర్తించారు.

தொடர்புடைய செய்தி