హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన అలయ్-బలయ్ కార్యక్రమాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈసారి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు. వారిలో ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు పగాడే, మేఘాలయ గవర్నర్ సీహెచ్ విజయ శంకర్ లు ఉన్నారు.