హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆదివారం బండారు విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన అలయ్-బలయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం రేవంత్, కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరాం, సురభి వాణీదేవి, కోదండరెడ్డి, జానారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని, బీబీపాటిల్, కూనంనేని, వీహెచ్, వికాస్ భాటియా, కోట శ్రీనివాసరావు, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.